Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒగ్గు కళాకారులకు సన్మానం

Follow Udayam on Google
babu varun Aug 20, 2026 8:28 AM రాజన్న సిరిసిల్లGeneral
ఒగ్గు కళాకారులకు సన్మానం - Udayam
అమెరికాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకల్లో తెలంగాణ కళారూపమైన ఒగ్గుకథను ప్రదర్శించి ఖ్యాతి గడించిన మిద్దె వినిత్, మిద్దె పరశురాములు బుధవారం వేములవాడ తిప్పాపూర్‌కు చేరుకున్నారు. రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న వారికి గౌడ సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు. కళాకారులు, కళాభిమానులు, మిద్దె రాములు శిష్యులు, కుటుంబ సభ్యులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.

Comments

G
Loading comments...