వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న 20.5 కిలోల గంజాయిని 18 గంటల ఆపరేషన్లో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల కదలికలపై నిఘా పెట్టిన బృందాలు ఖమ్మం, సూర్యాపేట మీదుగా వస్తున్న కారును పంతంగి టోల్ప్లాజా వద్ద అడ్డుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాయి.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10.25 లక్షలని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
Comments
Loading comments...

