Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాదుల హత్య కేసు: రెండోసారి పుట్ట మధును విచారించిన సీబీఐ

Follow Udayam on Google
S kumar Aug 21, 2026 9:37 AM పెద్దపల్లిGeneral
హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు-నాగమణి జంట హత్యల కేసులో సీబీఐ దర్యాప్తును తీవ్రతరం చేసింది. విచారణలో భాగంగా మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు పుట్ట మధుకర్‌ను అధికారులు రెండోసారి ప్రశ్నించారు. రామగుండం కమిషనరేట్‌లో ఆయన స్టేట్‌మెంట్‌ను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు 140 మందికి పైగా విచారించింది.

Comments

G
Loading comments...