వార్తలకు తిరిగి వెళ్లండి

నూకపెల్లిలోని సరస్వతి ఆలయంలో మూల నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని 15,555 గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 17మందికి పైగా మహిళలు 10గంటలపాటు శ్రమించి చేసిన గాజుల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
అర్చన, అష్టోత్తరాలు, సరస్వతి హోమం నిర్వహించడంతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు చేపట్టారు. 500 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు
Comments
Loading comments...

