వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ మండలం తురాటి గ్రామంలోని పలు వార్డుల్లో విద్యుత్ తీగలు ఇళ్ల సమీపంలో కిందికి వేలాడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
చిన్నారులు ఆడుకునే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే అధికారులు స్పందించి తీగలను పైకి మార్చాలని, అవసరమైన చోట కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

