వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గిపోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. జూన్, జులైలో సాధారణ వర్షపాతం 167.2 మి.మీకు గాను 48.14 మి.మీ మాత్రమే నమోదైంది.
ఖరీఫ్ సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. ఎనిమిది మండలాల్లో నీటిమట్టాలు 15 మీటర్ల లోతుకు చేరగా, పలు ప్రాంతాల్లో తాగు, సాగు నీటి కొరత ఏర్పడింది. రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

