వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని మండలం నంబూరు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని ప్రోగ్రామ్ మేనేజర్ శేఖర్ బాబు సూచించారు.
మత్తు పదార్థాలు ఆరోగ్యం, చదువును నాశనం చేస్తాయని తెలిపారు. బోస్కో డీ-అడిక్షన్ సెంటర్లో ఉచిత కౌన్సెలింగ్, చికిత్స అందుబాటులో ఉన్నాయని రమేశ్ చెప్పారు.
Comments
Loading comments...

