Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్‌కు నిజామాబాద్ బియ్యం

పవని రెడ్డి Jul 16, 2026 11:43 AM నిజామాబాద్ 6 viewsabout 2 hours ago
బ్రిటన్‌కు నిజామాబాద్ బియ్యం - Udayam Digital
భారత్-యూకే వాణిజ్య ఒప్పందంలో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి బ్రిటన్‌కు బియ్యం ఎగుమతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. గజానన్ రైస్ మిల్లుకు చెందిన 24.1 మెట్రిక్ టన్నుల సోనామసూరి బియ్యం లోడ్‌ వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సరుకు విశాఖపట్నం పోర్టు ద్వారా సముద్ర మార్గంలో యూకేకు చేరనుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు వీరాస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...