వార్తలకు తిరిగి వెళ్లండి
పిల్లల నోట్లతో పెద్ద స్కెచ్

రూ. లక్ష అసలు నోట్లు ఇస్తే రూ. 2 లక్షల కరెన్సీ ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను తుర్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకులను నమ్మించి, పైన, కింద అసలు నోట్లు పెట్టి మధ్యలో పిల్లలు ఆడుకునే నకిలీ నోట్లను ముఠా అప్పగించేది.
బాధిత వ్యక్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భువనగిరి, కుంట్లూరుకు చెందిన ముగ్గురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తక్యుద్దీన్ తెలిపారు.
Comments
Loading comments...