వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురవగా.. కామారెడ్డి జిల్లాలో చిరుజల్లులు పడ్డాయి.
నేడు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Comments
Loading comments...

