Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసర ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందా?: సీపీఎం

Follow Udayam on Google
H M G H Q Aug 31, 2026 4:53 PM కర్నూలుGeneral
నిత్యావసర ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందా?: సీపీఎం - Udayam
పత్తికొండ: నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరిగి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం, సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలపై ధరల భారం పెరిగిందని సీపీఎం మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సీఐటీయూ మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర విమర్శించారు.

Comments

G
Loading comments...