వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో చలో అసెంబ్లీ నేపథ్యంలో నిర్మల్కు చెందిన పలువురు ముదిరాజ్ నాయకులను పోలీసులు శుక్రవారం ఉదయం 6 గంటలకు ముందస్తుగా అదుపులోకి తీసుకుని టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. చలో అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకున్నారని నాయకులు తెలిపారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. ముదిరాజ్ హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

