Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరక్షరాస్యత నిర్మూలనలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

Follow Udayam on Google
dineshkumar Sep 05, 2026 7:34 PM చిత్తూరుGeneral
నిరక్షరాస్యత నిర్మూలనలో విద్యార్థులు భాగస్వాములు కావాలి - Udayam
అక్షరాస్యత పక్షోత్సవాల్లో భాగంగా చిత్తూరు ప్రభుత్వ కన్నన్ జూనియర్ కళాశాలలో వయోజన అక్షరాస్యతపై చర్చాగోష్టి నిర్వహించారు. వయోజన విద్య ఉపసంచాలకులు మహమ్మద్ ఆజాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ‘చిట్టి గురువు’గా మారి పరిసరాల్లోని ఒక నిరక్షరాస్యుడికి చదువు నేర్పాలని పిలుపునిచ్చారు. కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ నాగవల్లి, వయోజన విద్య పర్యవేక్షకులు కందేశ్వరరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...