వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన సమయంలో భద్రతా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ సూచించారు.
నిమజ్జనానికి చిన్నారులను తీసుకెళ్లవద్దని, ప్రధాన రహదారులపై నెమ్మదిగా ప్రయాణించాలని తెలిపారు. విద్యుత్ తీగలను గమనిస్తూ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. తక్కువ సమయంలో నిమజ్జనం పూర్తి చేసి, డీజేలకు దూరంగా సంప్రదాయ పద్ధతిలో శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

