వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా ధంసలాపురం చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్ పరిశీలించారు. నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
విగ్రహాల ఊరేగింపులో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బారికేడింగ్, క్రేన్లు, గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచడంతో పాటు పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

