Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవజాత శిశువు సజీవ పూడ్చివేత

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 6:23 AM ఆల్ ఇండియా జాతీయ
నవజాత శిశువు సజీవ పూడ్చివేత - Udayam Digital
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో అవివాహిత కుమార్తె గర్భాన్ని దాచేందుకు నవజాత శిశువును సజీవంగా పూడ్చిపెట్టిన ఘటన వెలుగుచూసింది. విషయం బయటపడడంతో శిశువు తాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, వైద్య బృందం ఘటనాస్థలానికి చేరుకుని శిశువు మృతదేహాన్ని వెలికితీశారు. శిశువు నోటికి, గొంతుకు వస్త్రం కట్టి పూడ్చిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...