వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కటాఫ్ తేదీ మారకపోవడంతో కొత్త పట్టాపాస్ పుస్తకాలు పొందిన వేలాది మంది రైతులు పెట్టుబడి సాయానికి దూరమవుతున్నారు. గతేడాదితో పోలిస్తే అర్హుల సంఖ్య కూడా తగ్గింది.
2019 జనవరి 31లోపు పట్టాదారులకే అర్హత కొనసాగుతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనలు సడలించి కొత్త పట్టాదారులను చేర్చాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
Comments
Loading comments...
