వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రంప్తో భేటీకి నెతన్యాహు.. ఎజెండాలో ఇరాన్ కీలకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాకు బయలుదేరారు. ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత ఇది తమ ఎనిమిదో సమావేశమని తెలిపారు. ఈ భేటీలో ఇరాన్ అంశంతో పాటు ఇతర కీలక విషయాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ భద్రతను బలోపేతం చేయడం, శాంతి పరిధిని విస్తరించడమే తమ లక్ష్యమని నెతన్యాహు వెల్లడించారు.
Comments
Loading comments...