Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌ వరదలు.. సొరంగాల్లో చిక్కుకున్న 573 మందికిపైగా కార్మికులు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 9:42 AM జాతీయంGeneral
నేపాల్‌ వరదలు.. సొరంగాల్లో చిక్కుకున్న 573 మందికిపైగా కార్మికులు - Udayam
నేపాల్‌లో ఆకస్మిక వరదల ధాటికి రసువా, నువాకోట్‌ జిల్లాల్లోని 11 జలవిద్యుత్‌ ప్రాజెక్టుల వద్ద 573 మందికిపైగా కార్మికులు సొరంగాల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత 934 మంది గల్లంతవగా 361 మందిని రక్షించారు. సొరంగాల వద్ద 10 నుంచి 12 అడుగుల మేర బురద, శిథిలాలు పేరుకుపోయాయి. చిక్కుకున్న వారిని కాపాడేందుకు నేపాల్‌ ఆర్మీతోపాటు భారత టన్నెల్‌, వైద్య నిపుణుల బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Comments

G
Loading comments...