వార్తలకు తిరిగి వెళ్లండి

సౌత్ జోన్ అండర్-23 మహిళల వన్డే టోర్నీలో నెల్లూరు జట్టు కడపపై 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నెల్లూరు 50 ఓవర్లలో 8 వికెట్లకు 403 పరుగులు చేయగా, జెస్సికా (107), మహాలక్ష్మి మనోజ్ (167) సెంచరీలతో రాణించారు.
404 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కడప జట్టులో ప్రశంస 102 పరుగులతో సెంచరీ చేసినా, మిగతా బ్యాటర్లు విఫలమవడంతో జట్టు 50 ఓవర్లలో 200 పరుగులకే పరిమితమైంది.
Comments
Loading comments...

