Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 12, 2026 6:21 PM మార్కాపురంఆంధ్రప్రదేశ్
ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి - Udayam
ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని భాజపా రాష్ట్ర మహిళా కార్యదర్శి బి. విజయలక్ష్మి అన్నారు. బుధవారం పొదిలిలో కళాశాల విద్యార్థులతో జాతీయ జెండాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కొత్తూరు నుంచి ప్రారంభమైన ర్యాలీ పాతూరు వరకు సాగింది. కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...