వార్తలకు తిరిగి వెళ్లండి

సాహస రంగంలో ప్రతిభ కనబరిచిన యువతను గుర్తించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ విషయాన్ని జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి సతీశ్ యాదవ్ తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 20లోపు https://awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

