Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి ప్రధాని శ్రీకారం

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Jul 30, 2026 2:38 PM అల్ ఇండియా జాతీయ
డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి ప్రధాని శ్రీకారం - Udayam Digital
దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చే లక్ష్యంతో 'నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్' సంకల్ప్ అభియాన్‌ను ఈ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ విషయాన్ని వెల్లడించారు. యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వ్యసనాన్ని అరికట్టేందుకు ఆధ్యాత్మిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, 'మై భారత్' యువత ఒక్క తాటిపైకి వస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...