వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరు 29వ వార్డులో రూ.22 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య భూమి పూజ చేశారు. అనంతరం పనులను ప్రారంభించారు.
ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
Comments
Loading comments...

