వార్తలకు తిరిగి వెళ్లండి
నందిగామ శివాలయాల్లో భక్తుల రద్దీ

నందిగామ మండలంలోని పల్లగిరి, దాములూరు కూడలి శివాలయాల్లో సోమవారం భక్తుల రద్దీ తీవ్రంగా నెలకొంది. ఆరుద్ర నక్షత్రం మరియు మాస శివరాత్రి ఒకే రోజు రావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు.
ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు విశేష అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు ఎంతగానో మారుమోగాయి.
Comments
Loading comments...