వార్తలకు తిరిగి వెళ్లండి
క్వారీ లీజుదారుకి భారీ జరిమానా

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో కంకర క్వారీ లీజుదారు గోవిందరావుకు గనుల శాఖ రూ.7.68 కోట్ల జరిమానా విధించింది. అనుమతులకు మించి అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు విచారణలో తేలడంతో ఈ నోటీసులు ఇచ్చారు.
పక్షం రోజుల్లో జరిమానా చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు లీజుదారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Comments
Loading comments...