వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్గిద్ద మండలంలోని రేషన్ దుకాణాల్లో శుక్రవారం ఈ-కేవైసీ ప్రక్రియ సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. దీంతో రేషన్ డీలర్లు, లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు చివరి రోజైనందున ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు వచ్చిన ప్రజలు నిరాశకు గురయ్యారు.
సాంకేతిక సమస్యను త్వరగా పరిష్కరించి, గడువును మరోసారి పొడిగించాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...

