Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మువ్వన్నెల వెలుగుల్లో సింగారం

Follow Udayam on Google
అనురూప్ Aug 15, 2026 6:17 AM ఆల్ ఇండియా జాతీయ
మువ్వన్నెల వెలుగుల్లో సింగారం - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజును మువ్వన్నెల విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం త్రివర్ణ కాంతుల్లో బురుజు ప్రత్యేక శోభను సంతరించుకుంది. కోయంబత్తూర్‌లోని ఆదియోగి విగ్రహాన్ని కూడా మువ్వన్నెల రంగుల విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. త్రివర్ణ కాంతులతో మెరిసిపోతున్న ఈ రెండు ప్రదేశాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Comments

G
Loading comments...