వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట సబ్ సెంటరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.వెంకట్ సందర్శించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

