వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్ పిఎసిఎస్ చైర్మన్గా ముత్యాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే వైస్ చైర్మన్ గా బిల్లకురి శంకరయ్యతో పాటు పలువురిని సభ్యులుగా నియమించారు.
ఈ సందర్భంగా నూతన చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. నూతన చైర్మన్ ను అందరూ అభినందించారు.
Comments
Loading comments...

