వార్తలకు తిరిగి వెళ్లండి
మంత్రి నివాసం వద్ద మున్సిపల్ కార్మికుల నిరసన!

కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. అంబేద్కర్ సెంటర్ నుండి భారీ ర్యాలీగా వెళ్ళిన కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా కొండా మురళికి వినతి పత్రం అందజేశారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...