వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పిలుపునిచ్చారు.
వన మహోత్సవంలో భాగంగా మంగళవారం కరీంనగర్ ముకరాంపుర ప్రభుత్వ పాఠశాలలో వారు మొక్కలు నాటారు. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పడాల శ్రీజ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

