వార్తలకు తిరిగి వెళ్లండి
ఆక్వా సంక్షోభంపై జగన్ భరోసా

చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, సిండికేట్ దోపిడీ కారణంగా రాష్ట్రంలో రొయ్యల సాగు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆక్వా రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నష్టాల నేపథ్యంలో పంట విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించేందుకు కూడా రైతులు సిద్ధమవుతున్నారు.
ఈ క్లిష్ట తరుణంలో తమ సమస్యలను వినేందుకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆక్వా రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. తమ పక్షాన నిలిచి పోరాడేందుకు ఆయన వస్తున్నారంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...