వార్తలకు తిరిగి వెళ్లండి

ముథోల్లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
భూమి కోసం, భుక్తి కోసం, పేదలు, రైతుల హక్కుల కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటాన్ని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

