వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తు పదార్థాలకు యువత బానిసలు కాకూడదని టెక్కలి డివిజన్-4 శక్తి టీమ్ హెడ్ కానిస్టేబుల్ ఎం.గిరిధర్ సూచించారు.
మంగళవారం మెలియాపుట్టి ప్రభుత్వ గిరిజన వెల్ఫేర్ పాఠశాలలో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చదువులో రాణించాలని, బాలబాలికలు స్వీయ రక్షణపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయభారతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

