Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకులనే పూజిద్దాం: ఏసీపీ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 9:55 AM వరంగల్General
మట్టి వినాయకులనే పూజిద్దాం: ఏసీపీ - Udayam
కాజీపేట డివిజన్‌ ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయని తెలిపారు. పీఓపీ విగ్రహాలు జీవరాశులకు, పర్యావరణానికి హానికరమని పేర్కొన్నారు. రానున్న వినాయక నవరాత్రుల్లో పీఓపీ విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలను ఉపయోగించాలని కోరారు.

Comments

G
Loading comments...