వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని 11వ వార్డులో వార్డు సభ్యుడు మహమ్మద్ షబ్బీర్ శివసేన యూత్ సభ్యులకు టీషర్ట్లు బహుకరించారు.
మతాలకు అతీతంగా యువతను ప్రోత్సహిస్తూ మతసామరస్యం, సోదరభావానికి ప్రాధాన్యత ఇచ్చిన షబ్బీర్ను యూత్ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శివసేన యూత్ అధ్యక్షుడు పేంద్రం రాజేష్, నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

