వార్తలకు తిరిగి వెళ్లండి
ముస్తాబైన కొమురవెల్లి స్టేషన్

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నస్వామి భక్తుల రవాణా సౌకర్యార్థం ఐదు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సర్వసిద్ధమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
దాదాపు తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయిన ఈ స్టేషన్లో హైలెవల్ ప్లాట్ఫారమ్, వైటింగ్ హాల్స్, పార్కింగ్ మరియు స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే అద్భుతమైన గోడ చిత్రాలను భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...