వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్లో మరిన్ని సుజుకీ తరహా కంపెనీలు రావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. భారత్లో 1,580 జపాన్ కంపెనీలు పనిచేస్తున్నాయని, వాటి నుంచి పెద్ద, లాభదాయక సంస్థలు ఎదగాలని ఆకాంక్షించారు. ఆగస్టు 24-27 వరకు గోయల్ నేతృత్వంలో 220 మందికిపైగా భారత వ్యాపార ప్రతినిధులు జపాన్లో పర్యటిస్తున్నారు. సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఫార్మా, ఇంధనం, మౌలిక వసతుల్లో సహకారంపై చర్చిస్తున్నారు.
Comments
Loading comments...

