వార్తలకు తిరిగి వెళ్లండి
నేతన్నల అకౌంట్లలోకి రూ.25వేలు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన దాదాపు 55 వేల మంది చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.25 వేల చొప్పున జమ చేయనున్నారు.
ఈ పథకాన్ని రాట్నం వడకడం, రంగులు అద్దడం వంటి చేనేత అనుబంధ రంగాలకూ వర్తింపజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...