వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటి భవిష్యత్తుకు బాటలు వెయ్యాలని దండేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామ సర్పంచ్ కొత్తపల్లి కళా చిరంజీవి, కార్యదర్శి లావణ్య సూచించారు.
మంగళవారం గ్రామంలో వనంహోత్సవ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. మొక్కలతోనే అందరికీ భవిష్యత్తు ఉంటుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సుజాత, టీచర్ అర్పిత, అంగన్వాడీ టీచర్ పద్మ , ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

