వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి జాతీయ జట్టు ద్వారాలు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా సెలక్టర్లు సిద్ధం చేసిన 15 మంది యువ పేసర్ల జాబితాలో షమీకి చోటు దక్కలేదు. శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్కూ అతడిని పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ నిర్ణయంపై మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఒక అద్భుతమైన బౌలర్ను యాజమాన్యం పక్కన పెట్టడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.
Comments
Loading comments...
