వార్తలకు తిరిగి వెళ్లండి

అన్ని రంగాల్లో సంస్కరణలు చేపట్టి దేశ వృద్ధిని నిలకడగా కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సంస్కరణలకు ఎన్డీయే ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు.
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలతో కొత్త అవకాశాలు సృష్టిస్తున్నామని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, విధానాల కొనసాగింపుతో ప్రపంచం భారత్ను వృద్ధికి ఆశాకిరణంగా చూస్తోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

