వార్తలకు తిరిగి వెళ్లండి
భారతదేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 'ఎక్స్' వేదికగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన ఆత్మీయ మిత్రుడైన మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన ఓ వీడియో సందేశంలో కొనియాడారు.
భారత్-ఇజ్రాయెల్ మధ్య బంధం మరింత బలపడిందని, భవిష్యత్తులోనూ ఈ మైత్రి కొనసాగిస్తూ కలిసి పనిచేస్తామని నెతన్యాహు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

