వార్తలకు తిరిగి వెళ్లండి

కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. భోజనశాల, ఆర్వో వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లు, గదులు, పరిసరాలను పరిశీలించి, భోజనం నాణ్యత, మెనూను తెలుసుకున్నారు.
విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అసౌకర్యం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

