వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు 5న నల్లజర్ల నుంచి ద్వారకాతిరుమల వరకు ఎమ్మెల్యే వెంకటరాజు చేపట్టనున్న పాదయాత్రపై కూటమి నేతలు సమీక్షించారు. ప్రకాశరావుపాలెంలో సోమవారం రాత్రి ఏఎంసీ ఛైర్మన్ బ్రహ్మరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
పాదయాత్రను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలు సమాలోచించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు తాతిన సత్యనారాయణ, జమ్ముల సతీశ్, పసుమర్తి రతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

