వార్తలకు తిరిగి వెళ్లండి
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల

మార్కాపురం పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. జవహర్ నగర్ కాలనీతో పాటు పలు వార్డుల్లో సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.
అదేవిధంగా కొత్తగా నిర్మించబోయే పలు రహదారుల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎన్నడూ లేనివిధంగా పట్టణంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా నారాయణరెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...