వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి మండలం మాటూరులో రూ.3 కోట్ల ఆర్అండ్బీ నిధులతో చేపడుతున్న రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారు.
చోడవరం రోడ్డు నుంచి చింతనిప్పుల అగ్రహారం వరకు బీటీ రోడ్డు నిర్మాణ నాణ్యతపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు రవాణా సౌకర్యం త్వరగా అందేలా పనులను వేగవంతం చేయాలని, నిధులను సమర్థవంతంగా వినియోగించి నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...
