వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడలో ప్రకటనల బోర్డుల ద్వారా పురపాలికకు రావాల్సిన రూ.లక్షల ఆదాయం పక్కదారి పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్గొండ రోడ్డులో అనుమతులు లేకుండానే భారీ బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఒక్కో బోర్డుకు నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నా, పురపాలికకు పన్నులు చెల్లించడం లేదని తెలుస్తోంది. సిబ్బంది అక్రమంగా డబ్బులు తీసుకొని అనుమతులు ఇచ్చారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

