Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్‌ను ఆహ్వానించిన మంత్రి సురేఖ

Follow Udayam Digital on Google
శివ కుమార్ Jul 30, 2026 4:37 PM హైదరాబాద్తెలంగాణ
గవర్నర్‌ను ఆహ్వానించిన మంత్రి సురేఖ - Udayam Digital
సికింద్రాబాద్‌లో జరగనున్న ఆషాఢ లష్కర్ బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థాన ప్రధాన అర్చకులు గవర్నర్‌కు ఆహ్వాన పత్రికను సమర్పించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...